తెలంగాణలో మళ్లీ భయపెడుతున్న కరోనా కేసులు.. సోమవారం ఒక్కరోజే..
ABN , First Publish Date - 2020-05-26T03:01:34+05:30 IST
తెలంగాణలో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకూ ...
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం 1,920 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం 31 మందికి, రంగారెడ్డి జిల్లాలో ఒకరికి, 15 మంది వలస కూలీలతో పాటు విదేశాల నుంచి వచ్చిన 18 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సోమవారం 72 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకూ మొత్తం 1,164 మంది డిశ్చార్జ్ అయ్యారు. 700 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 56 మంది మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు.