తెలంగాణలో కొత్తగా 1,410 కరోనా కేసులు.. ఏడుగురు మృతి

ABN , First Publish Date - 2020-07-10T03:35:23+05:30 IST

తెలంగాణలో కొత్తగా 1,410 కరోనా కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ...

తెలంగాణలో కొత్తగా 1,410 కరోనా కేసులు.. ఏడుగురు మృతి

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 1,410 కరోనా కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం 331 మంది చనిపోయారు. మొత్తం 30,946 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంకా 12,423 యాక్టివ్ కేసులున్నాయి. గురువారం 913 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 18,192 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు.


జీహెచ్‌ఎంసీ పరిధిలో 918 పాజిటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ జిల్లాలో 67, సంగారెడ్డిలో 79,  ఖమ్మంలో 12, కామారెడ్డిలో 2, వరంగల్ అర్బన్‌లో 34, వరంగల్ రూరల్‌లో 7, కరీంనగర్‌లో 32,  జగిత్యాలలో 1,  యాదాద్రిలో 2, మహబూబాబాద్‌లో 5, పెద్దపల్లిలో 1, మెదక్‌లో 17, మహబూబ్‌నగర్‌లో 8, భద్రాద్రి కొత్తగూడెంలో 23, జయశంకర్ భూపాలపల్లిలో 6, నల్గొండలో 21, రాజన్న సిరిసిల్లలో 8,  ఆదిలాబాద్‌లో 1, వికారాబాద్‌లో 5,  జనగాంలో 2, నిజామాబాద్‌లో 18, ములుగులో 1, వనపర్తిలో 2, సిద్దిపేటలో 1, సూర్యాపేటలో 10, గద్వాల్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 




Updated Date - 2020-07-10T03:35:23+05:30 IST