జిల్లాలో 338 మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-04-16T05:25:50+05:30 IST
జిల్లాలో గురువారం 338 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. 3,654 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా 328 మందికి, ఆర్టీపీసీఆర్ పరీక్షల ద్వారా పది మందికి కొవిడ్ సోకినట్లు వెల్లడైందని వైద్యాధికారులు తెలిపారు.
సిద్దిపేట, ఏప్రిల్ 15: జిల్లాలో గురువారం 338 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. 3,654 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా 328 మందికి, ఆర్టీపీసీఆర్ పరీక్షల ద్వారా పది మందికి కొవిడ్ సోకినట్లు వెల్లడైందని వైద్యాధికారులు తెలిపారు. గురువారం జిల్లాలో 365 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలో 87, గజ్వేల్లో 62, దుబ్బాకలో 1, నంగునూరులో 6, హుస్నాబాద్లో 19, చేర్యాలలో 13, పీహెచ్సీల వారీగా చిన్నకోడూరులో 8, దౌల్తాబాద్లో 5, ఇందుప్రియాల్లో 7, తిమ్మాపూర్లో 2, కొమురవెల్లిలో 5, మిరుదొడ్డిలో 9, భూంపల్లిలో 6, రాజగోపాలపేటలో 6, నారాయణరావుపేటలో 1, పుల్లూరులో 5, తొగుటలో 1, అహ్మదీపూర్లో 7, సిరిగిరిపల్లిలో 11, జగదేవ్పూర్లో 9, తిగుల్లో 1, కొండపాకలో 2, కుకునూరుపల్లిలో 13, మరుకుక్లో 2, ములుగులో 3, సింగన్నగూడెంలో 1, రాయపోల్లో 8, వర్గల్లో 20, బెజ్జంకిలో 7, తోటపల్లిలో 2, కోహెడలో 9 కేసులు వెల్లడైనట్లు తెలిపారు.