మృతి చెందిన వ్యక్తికి కరోనా.. అంత్యక్రియలకు హాజరైన వారిలో టెన్షన్..!
ABN , First Publish Date - 2020-07-24T20:11:16+05:30 IST
మృతి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్థారించడంతో అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన కాజీపేట మండలం
మడికొండ(వరంగల్): మృతి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్థారించడంతో అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన కాజీపేట మండలం మడికొండలో గురువారం కలకలం రేపింది. స్థానికులు వివరాల ప్రకారం.. మడికొండ గ్రామ శివారులోని ఓ కాలనీకి చెందిన వ్యక్తి అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు సోమవారం అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
మృతుడి అంత్యక్రియలు బుధవారం మడికొండలోని శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, బంధువులు నిర్వహించారు. అయితే అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి శాంపిల్స్ను పరీక్షించిన వైద్యులు అతడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్థారించారు. దీంతో అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. అంత్యక్రియలకు హాజరైన వారంతా హోమ్ క్వారంటైన్లో ఉండాలని కడిపికొండ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శైలజ సూచించారు.