హైదరాబాద్‌లో జాబ్.. కరోనా టెస్ట్ ఫలితాలు రాకముందే సొంతూరికి.. చివరకు..

ABN , First Publish Date - 2020-07-03T16:10:43+05:30 IST

సాయిరెడ్డిపల్లిలో ఒకరికి కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు నెక్కొండ ప్రాథమిక వైద్య కేంద్రం డాక్టర్‌ రమేశ్‌ గురువారం తెలిపారు

హైదరాబాద్‌లో జాబ్.. కరోనా టెస్ట్ ఫలితాలు రాకముందే సొంతూరికి.. చివరకు..

సాయిరెడ్డిపల్లిలో ఒకరికి కరోనా పాజిటీవ్‌


నెక్కొండ (వరంగల్) : సాయిరెడ్డిపల్లిలో ఒకరికి కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు నెక్కొండ ప్రాథమిక వైద్య కేంద్రం డాక్టర్‌ రమేశ్‌  గురువారం తెలిపారు. సదరు వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌ మార్టులో పనిచేస్తుంటాడని, షాపులో ఉన్న వారందరికి  కరోనా పరీక్షలు జరపగా అతనికి పాజిటీవ్‌ వచ్చినట్లు తమకు సమాచారం అందించారని చెప్పారు. హైదరాబాద్‌లో పరీక్షను నిర్వహించగా, రిపోర్టు రాకముందే  గ్రామానికి వచ్చినట్టు తెలిపారు. కాగా అతను నెక్కొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి రెండు రోజుల క్రితం  వచ్చిన  సమాచారం ఉండటంతో  సదరు ఆస్పత్రిని 14 రోజులు తెరవవద్దని, డాక్టర్‌ను హోంక్వారెంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో సీఐ తిరుమల్‌, తహసీల్దార్‌ డీఎస్‌ వెంకన్న, ఎస్సై నాగరాజు, పాల్గొన్నారు.

Updated Date - 2020-07-03T16:10:43+05:30 IST