మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-05-10T05:59:00+05:30 IST

రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన చికిత్స కోసం హైదరా బాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్‌
మంత్రి కొప్పుల కోలుకోవాలని పూజలు చేస్తున్న కార్యకర్తలు

యశోద ఆసుపత్రిలో చేరిన మంత్రి..ఆలయాల్లో పూజలు

ధర్మపురి, మే 9: రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన చికిత్స కోసం హైదరా బాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు. మంత్రి ఈశ్వర్‌ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గల ఆరు మండలాల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఆలయాల్లో పూజలు జరిపి స్వామి వారలను వేడుకుంటున్నారు. ఇటీవల మంత్రి కూ తు రు, అల్లుడికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా వారితో కాంటాక్ట్‌లో ఉన్న మంత్రి స తీమణికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. రెండు రోజుల క్రితం ఆమెయ శో ద ఆసుపత్రిలో చేరారు. మంత్రి కూతురు, అల్లుడు హోం క్వారంటైన్‌లో ఉ న్నారు. తాజాగా మంత్రి ఈశ్వర్‌కు స్వల్ప లక్షణాలు కనిపించడంతో హైదరా బాద్‌లో ఆదివారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఉద యం యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ పరిస్థితుల్లో మంత్రి ఈశ్వర్‌కు ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ చేయవద్దని మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.  

   

Updated Date - 2021-05-10T05:59:00+05:30 IST