పవన్ కల్యాణ్కు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-04-16T22:34:42+05:30 IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనా బారినపడ్డారు. తన వ్యవసాయక్షేత్రంలో ఉంచి
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనా బారినపడ్డారు. తన వ్యవసాయక్షేత్రంలో ఉంచి పవన్ కల్యాణ్కు చికిత్సను అందిస్తున్నారు. పవన్ ఊపిరితిత్తుల్లో కొద్దిగా నెమ్ము చేరిందని వైద్యులు తెలిపారు. జ్వరం, ఒళ్లు నొప్పులతో పవన్ కల్యాణ్ బాధపడుతున్నారు. ఈ నెల 3న తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. సభ తర్వాత నుంచి క్వారంటైన్లో పవన్ కల్యాణ్ ఉన్నారు.