బోయినపల్లి పీఎస్లో కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-05-23T15:19:34+05:30 IST
హైదరాబాద్: పోలీస్శాఖలో కరోనా కలకలం రేపుతోంది. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
హైదరాబాద్: పోలీస్శాఖలో కరోనా కలకలం రేపుతోంది. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పది రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో బాధిత కానిస్టేబుల్ విధులు నిర్వర్తించారు. ఆయనతో పనిచేసిన వారికి సైతం వైద్య పరీక్షలు నిర్వహించారు. తోటి సిబ్బందిని హోమ్ క్వారంటైన్కు తరలించారు. పోలీస్ శాఖలో పాజిటివ్ కేసుల సంఖ్య 10కి చేరింది. ఇప్పటికే తొమ్మిది మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక కానిస్టేబుల్ మృతి చెందారు.