కార్పొరేటర్కు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-07-01T11:30:48+05:30 IST
నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉండే ఓ కార్పొరేటర్కు మంగళవా రం కరోనా పాజిటివ్ వచ్చింది
నిజామాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉండే ఓ కార్పొరేటర్కు మంగళవా రం కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనను చికిత్స నిమిత్తం అతన్ని అధికారులు ఆసు పత్రికి తరలించారు. ఆయనతో పాటు ఉ న్న వారిని హోంక్వారంటైన్ చేశారు. ఆయన ఎవరెవరిని కలిశారు? ఎక్కడెక్కడకు వె ళ్లారు? తదితర వివరాలను ఆరా తీస్తున్నారు. వారి సమాచారం తీసుకుంటూ ప్రైమ రి, సెకండరి కాంటాక్ట్స్ను హోంక్వారంటైన్ లో ఉండాలని కోరుతున్నారు. జాతీయ స్థా యిలో ఒక కార్యక్రమానికి ఎంపికైన ఆయన మరో ఇద్దరు కార్పొరేటర్లతో కలిసి తిరిగినట్లు తెలుస్తోంది.
ఇతర నాయకులను కూడా ఆయన కలిసినట్లు సమాచారం. వారందరి వివరాలు సేకరించిన అధికారులు మిగతా వారివి కూడా నమూనాలను సేకరించే పనిలో ఉన్నారు. జిల్లాలో మార్చి నుంచి ఇప్పటి వరకు మొత్తం 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. వీరిలో 86 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. చికిత్స పొందు తూ ఇద్దరు మృతిచెందారు. మిగతా వారు 30 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.