పెళ్లయిన కొద్ది సేపటికే వరుడికి ఫోన్.. నీకు కరోనా పాజిటివ్ అంటూ..

ABN , First Publish Date - 2020-07-24T21:28:01+05:30 IST

కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని ఓ గ్రామంలో గురువారం వివాహం జరిగింది. వివాహం తంతు పూర్తి కాగానే వధువు స్వస్థలం గూడూరుకు అందరూ సంతోషంగా బయలుదేరారు. మార్గమధ్యంలో

పెళ్లయిన కొద్ది సేపటికే వరుడికి ఫోన్.. నీకు కరోనా పాజిటివ్ అంటూ..

వరుడికి కరోనా పాజిటివ్‌.. పెళ్లయిన గంటల్లోనే క్వారంటైన్‌కు.. 


ఒంటిమిట్ట/కడప(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని ఓ గ్రామంలో గురువారం వివాహం జరిగింది. వివాహం తంతు పూర్తి కాగానే వధువు స్వస్థలం గూడూరుకు అందరూ సంతోషంగా బయలుదేరారు. మార్గమధ్యంలో ఉండగానే వరుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందంటూ వైద్యాధికారులు ఫోన్‌ చేశారు. వధువుకు నెగెటివ్‌ వచ్చిందని చెప్పారు. దీంతో వారందరినీ తిరిగి కడప కోవిడ్‌ ఆసుపత్రికి రప్పించారు. పెళ్లికి ఎవరెవరు హాజరయ్యారనేదానిపై విచారించామని వైద్యాధికారి కవిత తెలిపారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2020-07-24T21:28:01+05:30 IST