ఈ దారిపేరు వింటే వ‌ణుకు ఖాయం!

ABN , First Publish Date - 2020-05-21T15:05:04+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల‌వుతోంది. అయితే ఈ కొరోనా సంక్షోభ సమయంలో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో అర్థాంత‌రంగా ఆగిపోయిన‌ రహదారిని నిర్మించారు. గ్రామస్తులు ఈ రహదారికి కరోనా...

ఈ దారిపేరు వింటే వ‌ణుకు ఖాయం!

అహ్మద్‌నగర్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల‌వుతోంది. అయితే ఈ కొరోనా సంక్షోభ సమయంలో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో అర్థాంత‌రంగా ఆగిపోయిన‌ రహదారిని నిర్మించారు. గ్రామస్తులు ఈ రహదారికి కరోనా రోడ్ అని పేరు పెట్టారు. ఇంతేకాదు అక్క‌డ కరోనా రోడ్ అనే సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అహ్మద్‌నగర్ జిల్లాలో గ‌ల‌ మాండవా గ్రామంలో ఈ రహదారిని లాక్‌డౌన్‌ సమయంలో గ్రామస్తులంతా కలిసి నిర్మించారు. అనంత‌రం ఈ ర‌హ‌దారికి క‌రోనా రోడ్ అనే పెట్టాల‌ని నిర్ణ‌యిచుకున్నారు. అహ్మద్‌నగర్‌లోని మాండవ గ్రామం నుంచి లక్ష్మీవాది వరకు స‌రైన రోడ్డు మార్గంలేదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో వీలైనంత త్వ‌ర‌గా ఈ రోడ్డును నిర్మించాల‌ని గ్రామ‌స్తులంతా అనుకున్నారు.  గ్రామానికి చెందిన కొంత‌మంది తమ భూమిని  రహదారి కోసం దానం చేశారు. ఈ నేప‌ధ్యంలో గ్రామ‌స్తులంతా చేయిచేయివేసి ర‌హ‌దారి నిర్మాణాన్ని పూర్తిచేశారు. 

Updated Date - 2020-05-21T15:05:04+05:30 IST