జ్వరం తగ్గి.. మళ్లీ వస్తే..!

ABN , First Publish Date - 2021-04-18T23:25:55+05:30 IST

జ్వరం తగ్గి.. మళ్లీ వస్తే..!

జ్వరం తగ్గి.. మళ్లీ వస్తే..!

హైదరాబాద్: కరోనా రెండో దశ ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. తొలి దశలో పాజిటివ్ వస్తే ఫలానా లక్షణాలు అని స్పష్టంగా తెలిసేది. కానీ ప్రస్తుత సెకెండ్ వేవ్‌లో మహమ్మారి బారిన పడ్డ వారిలో అంతుపట్టని లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి మూడు నుంచి నాలుగు రోజుల పాటు జ్వరం వచ్చి తగ్గి మళ్లీ వస్తోంది. ఇంకొందరికి తీవ్రమైన నీరసం, దమ్ము, చాతిలో అసహజంగా ఉంటుంది. పలువురిని తల నొప్పి, వెన్ను నొప్పి, గొంతునొప్పి బాధిస్తున్నాయి. కళ్లు ఎర్రబడటం, చర్మంపై మచ్చలు, నోటిలో పొక్కులు, ఆఖలి లేకపోవడం, విరోచనాలు వంటి లక్షణాలు కూడా ఇటీవల కాలంలో కోవిడ్ నిర్ధారణ అవుతున్న చాలా మందిలో బయటపడుతున్నాయి. 

Updated Date - 2021-04-18T23:25:55+05:30 IST