కరోనా క్రైసిస్ అదుపులోనే ఉంది.. భయపడొద్దన్న సీఎం

ABN , First Publish Date - 2020-05-26T03:15:01+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది.

కరోనా క్రైసిస్ అదుపులోనే ఉంది.. భయపడొద్దన్న సీఎం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటికే 14వేలపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో సోమవారం మాట్లాడారు. ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉందని, ప్రజలెవరూ భయపడొద్దని కేజ్రీ ధైర్యం చెప్పారు. లాక్‌డౌన్ తొలగించినప్పటి నుంచి ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని తెలిపారు. అయితే కరోనా మరణాలో లేక విషమ పరిస్థితిలో ఉన్న కేసుల సంఖ్యో పెరిగితేనే ఆందోళన చెందాలని, అలా జరగనంత వరకూ ఎటువంటి భయమూ అక్కర్లేదని వివరించారు.

Updated Date - 2020-05-26T03:15:01+05:30 IST