కరోనా ఇప్పటికీ ప్రాణాంతకమే.. స్పష్టం చేసిన డబ్ల్యూహెచ్‌వో

ABN , First Publish Date - 2020-06-03T04:28:06+05:30 IST

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి.. ఇప్పటికీ ప్రాణాంతకమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టంచేసింది.

కరోనా ఇప్పటికీ ప్రాణాంతకమే.. స్పష్టం చేసిన డబ్ల్యూహెచ్‌వో

న్యూజెర్సీ: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి.. ఇప్పటికీ ప్రాణాంతకమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టంచేసింది. ఇటలీకి చెందిన ఓ డాక్టర్.. తమ దేశంలో వైరస్ లేదని చేసిన వ్యాఖ్యలకు సమాధానంగానే డబ్ల్యూహెచ్‌వో ఈ వ్యాఖ్యలు చేసింది. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మైక్ ర్యాన్.. ‘వైరస్ ఉన్నట్టుండి తనకు తానే మాయమైపోయిందనే అపోహలు కలిగించకూడదు. ప్రజలకు ఇలాంటి భ్రమలు కలుగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈ పరిస్థితుల్లో చాలా ఉంది’ అని చెప్పారు.

Updated Date - 2020-06-03T04:28:06+05:30 IST