వారికి కరోనా టెస్టు తప్పనిసరి కాదు

ABN , First Publish Date - 2020-05-28T08:36:34+05:30 IST

కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్లలో గర్భిణులు, నవజాత శిశువులు, పిల్లలు, కౌమార దశలోని వారికి చికిత్స చేసే సమయంలో కరోనా పరీక్ష తప్పనిసరి కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

వారికి కరోనా టెస్టు తప్పనిసరి కాదు

న్యూఢిల్లీ మే 27: కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్లలో గర్భిణులు, నవజాత శిశువులు, పిల్లలు, కౌమార దశలోని వారికి చికిత్స చేసే సమయంలో కరోనా పరీక్ష తప్పనిసరి కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ విషయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం గర్భిణులు, నవజాత శిశువులు, పిల్లలు, కౌమార దశలోని వారికి కరోనా స్థితితో సంబంధం లేకుండా అవసరమైన సేవలను అందించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకూడదు. కరోనాతో నిమిత్తం లేకుండా ప్రసవించిన గంటలోపే తల్లిపాలు బిడ్డ తాగేలా చూడాలి. ఈ సమయంలో తల్లికి ఫేస్‌మాస్క్‌తోపాటు చేతులు శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. 

Updated Date - 2020-05-28T08:36:34+05:30 IST