మణికొండలో మున్సిపల్ సిబ్బందికి కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-05-28T19:10:15+05:30 IST

హైదరాబాద్: మణికొండ మున్సిపాలిటీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు.

మణికొండలో మున్సిపల్ సిబ్బందికి కరోనా పరీక్షలు

హైదరాబాద్: మణికొండ మున్సిపాలిటీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మణికొండ మున్సిపల్ కమిషనర్ జయంత్ ఆధ్వర్యంలో ధాన్వి హెల్త్ కేర్ ఫౌండేషన్ తరపున మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ నుంచి రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు సూచించారు. జ్వరం, జలుబు వంటి లక్షణాలున్నవారు ఆసుపత్రులకు వెళ్లాలని, లేదా తమకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మణికొండ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పాల్గొన్నారు.


Updated Date - 2020-05-28T19:10:15+05:30 IST