సంగరేణిలో 12,308 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-05-15T08:13:02+05:30 IST

సింగరేణిలో ఇప్పటివరకు 12,308 మంది కార్మికులకు కరోనా సోకింది. అందులో 9,938 మంది పూర్తిగా కోలుకున్నారు.

సంగరేణిలో 12,308 మందికి కరోనా

వైద్య సేవలకు రూ.71 కోట్లు.. ఐదు ఆక్సిజన్‌ ప్లాంట్లు

హైదరాబాద్‌, మే 14(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో ఇప్పటివరకు 12,308 మంది కార్మికులకు కరోనా సోకింది. అందులో 9,938 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం 2,268 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నివారణ, సిబ్బంది వైద్య సేవలకు రూ.71 కోట్లను వెచ్చించినట్లు ఆ  సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. రూ.3.60 కోట్లతో సింగరేణి ప్రధాన, ఏరియా ఆస్పత్రుల్లో ఐదు ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. కరోనాతో మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.15 లక్షలు చెల్లిస్తున్నట్లు తెలిపింది.

Updated Date - 2021-05-15T08:13:02+05:30 IST