293మందికి కరోనా... నలుగురి మృతి

ABN , First Publish Date - 2021-07-24T06:34:19+05:30 IST

జిల్లాలో గురు, శుక్రవారం 293 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, నలుగురు మృతిచెందారు.

293మందికి కరోనా... నలుగురి మృతి

తిరుపతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురు, శుక్రవారాల మధ్య 24 గంటల్లో 293 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా అదే వ్యవధిలో కొవిడ్‌తో రాష్ట్రంలోనే అత్యధికంగా నలుగురు మృతి చెందారు. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు, సంభవించిన మరణాలతో జిల్లాలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్‌ కేసులు 228505కు చేరగా కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 1702కు పెరిగింది. కాగా శుక్రవారం ఉదయానికి జిల్లాలో 3014 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు చిత్తూరులో 49, తిరుపతి నగరంలో 25, తిరుపతి రూరల్‌లో 19, పీలేరు, గుడిపాల మండలాల్లో 13 చొప్పున, పెద్దపంజాణిలో 12, బంగారుపాళ్యంలో 10, రేణిగుంట, పెనుమూరు, వడమాలపేట మండలాల్లో 8 వంతున, చంద్రగిరి, పాకాల మండలాల్లో 7 చొప్పున, తొట్టంబేడులో 6,మదనపల్లె, పూతలపట్టు, శ్రీరంగరాజపురం, ఎర్రావారిపాళ్యం, కుప్పం మండలాల్లో 5 వంతున, పుత్తూరు, నగరి, కలికిరి మండలాల్లో 4 చొప్పున, శ్రీకాళహస్తి, ఐరాల, పులిచెర్ల, రామచంద్రాపురం, గుడుపల్లె, రామకుప్పం, రొంపిచెర్ల, కేవీబీపురం, కార్వేటినగరం, రామసముద్రం, కురబలకోట మండలాల్లో 3 చొప్పున, సదుం, ఏర్పేడు, సోమల, ములకలచెరువు, జీడీనెల్లూరు, బీఎన్‌ కండ్రిగ, శాంతిపురం, తంబళ్ళపల్లె, బైరెడ్డిపల్లె, చౌడేపల్లె, గుర్రంకొండ, వి.కోట, పీటీఎం మండలాల్లో 2 వంతున, తవణంపల్లె, వాల్మీకిపురం, నాగలాపురం, నిండ్ర, బి.కొత్తకోట, కేవీపల్లె, యాదమరి, కలకడ, సత్యవేడు, పుంగనూరు, పాలసముద్రం, గంగవరం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

Updated Date - 2021-07-24T06:34:19+05:30 IST