మండ్లిపల్లిలో ఉపాధ్యాయునికి కరోనా

ABN , First Publish Date - 2021-04-21T06:53:30+05:30 IST

మండల పరిధిలోని మండ్లిపల్లి ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యా యుడికి కరోనా పాజిటివ్‌ నమోదు అయ్యింది.

మండ్లిపల్లిలో ఉపాధ్యాయునికి కరోనా

 ఐదుగురు విద్యార్థులకు కూడా..

తనకల్లు, ఏప్రిల్‌ 20: మండల పరిధిలోని మండ్లిపల్లి ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యా యుడికి కరోనా పాజిటివ్‌ నమోదు అయ్యింది. దీంతో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి కరో నా నిర్దారణ అయ్యింది. దీంతో మం డ్లిపల్లి గ్రామం లో భయాందోళనలు నెల కొన్నాయి. ఎంపీడీఓ పూల నరసింహులు గ్రామానికి వెళ్ళి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో కలసి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్థులతో కలసి ఎలాంటి ఆందోళన చెందవద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. 

ఓడీసీ మండలంలో ఒకరికి... 

ఓబుళదేవరచెరువు: మండలంలోని వడ్డివారిపల్లిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చి నట్లు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ ఆనందవర్ధన మంగళవారం తెలిపారు.



Updated Date - 2021-04-21T06:53:30+05:30 IST