జడ్జి రామకృష్ణకు కరోనా

ABN , First Publish Date - 2021-04-18T21:03:32+05:30 IST

జడ్జి రామకృష్ణకు కరోనా సోకింది. చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైల్లో ఉన్న ఆయనకు...

జడ్జి రామకృష్ణకు కరోనా

తిరుపతి: జడ్జి రామకృష్ణకు కరోనా సోకింది. చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైల్లో ఉన్న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో దూషించారని పేర్కొంటూ కేవీ పల్లి మండలం, మాజీ జడ్పీటీసీ సభ్యుడు  జి. రామచంద్రయ్య  ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 15వ తేదీన జడ్జి రామకృష్ణను అరెస్ట్ చేసి స్థానిక సబ్ జైలుకు తరలించిన పోలీసులు  జడ్జి రామకృష్ణకు వైద్య పరీక్షలతో పాటు కోవిడ్ పరీక్ష చేయించారు. ఆదివారం వచ్చిన రిపోర్టులో ఆయనకు కరోనా అని నిర్ధారణ అయింది.

Updated Date - 2021-04-18T21:03:32+05:30 IST