ఇద్దరు వైద్యులకు కరోనా

ABN , First Publish Date - 2021-05-18T06:00:09+05:30 IST

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలకు రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇద్దరు వైద్యులకు కరోనా
రావికమతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

సెలవులో డాక్టర్లు.. ఆందోళనలో రోగులు
పీహెచ్‌సీకి వైద్య సిబ్బందే దిక్కు

రావికమతం, మే 17:
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలకు రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇద్దరు వైద్యులకు కరోనా రావడంతో సెలవులో ఉన్నారు. డాక్టర్‌ శ్రీనివాస్‌కు పాజిటివ్‌ వచ్చి 15 రోజులుగా అందుబాటులో లేరు. మరో డాక్టర్‌ టీవీఎస్‌ నాయుడుకు ఆదివారం పాజిటివ్‌ రావడంతో ఆయన కూడా సెలవులో పెట్టేశారు. దీంతో వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వస్తున్న రోగులు ఆందోళన చెందుతున్నారు. టీకా వేయించుకున్న వారికి ఎటువంటి అనారోగ్యం తలెత్తినా వైద్య సేవలు అందించేందుకు వైద్యులు అందుబాటులో లేకపోవడ ంతో సిబ్బందే దిక్కవుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఇద్దరు డాక్టర్లు అందుబాటులోకి వచ్చే వరకు ఈ పీహెచ్‌సీలో వేరే వైద్యుడ్ని నియమించాలని రోగులు కోరుతున్నారు.

Updated Date - 2021-05-18T06:00:09+05:30 IST