మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా

ABN , First Publish Date - 2020-08-03T21:13:24+05:30 IST

మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.

మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా

హైదరాబాద్: మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే చందర్‌కు పాజిటీవ్ నిర్ధారణ అయింది. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇటీవల కాలంలో తరచుగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే హోంమంత్రి మహ్మాద్ ఆలీ, ఆయన కొడుకు, మనవడు కోవిడ్ బారిన పడ్డారు. హోంమంత్రి చికిత్స నుంచి కోలుకుని యాధావిధిగా విధులు కొనసాగిస్తున్నారు. మొత్తంగా ఓ మంత్రి, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మేయర్లకు కరోనా సోకింది. ప్రభుత్వ, నియోజకవర్గాల కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో వారు కోవిడ్ బారిన పడుతున్నట్లు సమాచారం.

Updated Date - 2020-08-03T21:13:24+05:30 IST