ఏపీలో కరోనా Update

ABN , First Publish Date - 2021-07-23T23:24:21+05:30 IST

ఏపీలో కరోనా Update

ఏపీలో కరోనా Update

గుంటూరు: కరోనా వైరస్ నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో కోవిడ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రోజు ఏపీలో కొత్తగా 1,747 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ వల్ల ఇవాళ 14 మంది మృతి చెందారని వైద్య శాఖ పేర్కొంది. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 19,50,339 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ వల్ల మొత్తం 13,223 మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఏపీలో 22,939 యాక్టివ్ కేసులు ఉన్నాయని, కరోనా నుంచి 19,14,177 మంది రికవరీ అయ్యారని వైద్య శాఖ వెల్లడించింది. ఇవాళ కోవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా, తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారని వైద్య శాఖ పేర్కొంది.

Updated Date - 2021-07-23T23:24:21+05:30 IST