విశ్వవిద్యాల‌యాల‌కు నూత‌న‌ మార్గ‌ద‌ర్శ‌కాలు

ABN , First Publish Date - 2020-07-13T16:50:13+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని అన్ని విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నూత‌న‌ మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం అక్టోబర్ నుంచి కొత్త విద్యాసంవ‌త్స‌రం...

విశ్వవిద్యాల‌యాల‌కు నూత‌న‌ మార్గ‌ద‌ర్శ‌కాలు

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని అన్ని విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నూత‌న‌ మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం అక్టోబర్ నుంచి కొత్త విద్యాసంవ‌త్స‌రం ప్రారంభంకానుంది. నవంబర్ నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభంకానున్నాయి. వచ్చే ఏడాదిలో వార్షిక‌ పరీక్షలు జర‌గ‌నున్నాయి. కాగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఉత్తరప్రదేశ్‌లోని అన్ని విద్యాసంస్థలను జూలై 31 వరకు మూసివేయ‌నున్నారు. ఈ స‌మ‌యంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వ‌హిస్తున్నారు. 

Updated Date - 2020-07-13T16:50:13+05:30 IST