HYD: జీహెచ్ఎంసీ పరిధిలో తీవ్రంగా వ్యాక్సిన్ కొరత
ABN , First Publish Date - 2021-07-31T17:03:30+05:30 IST
జీహెచ్ఎంసీ పరిధిలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. నగరంలో సెకండ్ డోస్ కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. నగరంలో సెకండ్ డోస్ కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. టీకా సెంటర్ల వద్ద కిలోమీటర్ల మేర జనం టీకా కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో పీహెచ్సీలో 100 నుంచి 200 మంది మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. అటు సరూర్ నగర్ టీకా సెంటర్ వద్ద గందరగోళం నెలకొంది. టీకా సెంటర్ వద్ద గుంపులు గుంపులుగా జనం చేరుకున్నారు. రోజుల తరబడి వ్యాక్సినేషన్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న టీకా అందలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.