వ్యాక్సిన్తో కరోనాను ఓడించాలి: కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2021-08-21T00:39:00+05:30 IST
ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యాక్సిన్ తీసుకుని కరోనాను ఓడించాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేదలను ఆదుకునేందుకు దీపావళి వరకు
సూర్యాపేట: ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యాక్సిన్ తీసుకుని కరోనాను ఓడించాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేదలను ఆదుకునేందుకు దీపావళి వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. అవసరమైతే మరికొంతకాలం బియ్యం పంపిణీని పొడిగిస్తామన్నారు. కరోనా కష్టకాలంలో విధులు నిర్వహించిన ఫ్రంట్లైన్ వారియర్స్ అందరికీ పాదాభివందనాలు చేయడంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాని చెప్పారు. కరోనా వారియర్స్కు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ను కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా చిన్నారులకు వ్యాక్సిన్ వేయడానికి చర్యలు తీసుకుంటున్నామని కిషన్రెడ్డి పేర్కొన్నారు.