కరోనా బాధితులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2021-06-18T06:27:10+05:30 IST
కరోనా భాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టరేట్ ఎదుట గు రువారం దళిత శక్తి పోగ్రాం(డీఎస్పీ) అధ్వర్యంలో నాయకులు ధర్నా చేపట్టారు.
- కలెక్టరేట్ ఎదుట డీఎస్పీ నాయకుల ధర్నా
సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 17: కరోనా భాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టరేట్ ఎదుట గు రువారం దళిత శక్తి పోగ్రాం(డీఎస్పీ) అధ్వర్యంలో నాయకులు ధర్నా చేపట్టారు. దళిత శక్తి పోగ్రాం జిల్లా కమిటీ అధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని అం బేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ మహిపాల్ మహారాజ్ మాట్లాడుతూ కరో నా బారిన పడిన భాధితులందరికీ పూర్తిగా ఉచితం గానే వైద్యం అందించడంతోపాటు, అరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనా బాధిత కుటుం బాలకు నిత్యావసర సరుకలతోపాటు అర్ధిక సహా యం అందించి పౌష్టికాహారం అందించాలని కోరారు. కరోనా లాక్డౌన్ వలన పాఠశాలలు మూసివేయ డంతో విద్యార్థుల చదువు కోసం ప్రతి ఒక్క విద్యారి ్ధకి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లను ప్రభుత్వమే ఉచి తంగా అందించాలని డిమాండ్ చేశారు. కరోనా తో చనిపోయిన కుటుంబాలకు 25లక్షల నష్టపరిహారం అందించాలన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నెలకు రూ. 2వేలు అందించాలని కలె క్టరేట్ అధికారికి వినతి ప్రతం అందించారు. కార్య క్రమంలో దళిత శక్తి పోగ్రాం కోకన్వీనర్ కట్కూరి రాజు, మండల కన్వీనర్ ఎడపల్లి బాబు, తాళ్లపల్లి అనిల్, హరీష్, భీమ్ప్రకాష్, బడే అమర్, మనోజ్ కుమార్, లింగంపల్లి సమన్, విక్రమ్, పరుశరాం, శం కర్, అనంద్ తదితరులు పాల్గొన్నారు.