నాగార్జునసాగర్లో పంజా విసిరిన కరోనా వైరస్
ABN , First Publish Date - 2021-04-20T00:51:49+05:30 IST
నాగార్జునసాగర్లో పంజా విసిరిన కరోనా వైరస్
నల్లగొండ: నాగార్జునసాగర్లో కరోనా వైరస్ పంజా విసిరింది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున వేగంగా వైరస్ విస్తరించింది. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్తో పాటు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. టీఆర్ఎస్ నేతలు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ నేతలకూ కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ రోజు 160 కేసులు నమోదయ్యాయి.