మసీదులో కజికిస్తాన్ దేశీయులు
ABN , First Publish Date - 2020-04-09T09:07:17+05:30 IST
మసీదులో కజికిస్తాన్ దేశీయులు
సత్తెనపల్లి, ఏప్రిల్ 8: విజిటింగ్ వీసా నిబంధనలను అతిక్రమించి గుం టూరు జిల్లా సత్తెనపల్లిలోని పెద్దమసీదులో ఉంటున్న 10మంది కజికిస్తాన్ దేశీయులను పోలీసులు గుర్తించారు. లాక్డౌన్ నేపథ్యంలో కొత్త వ్యక్తులు మసీదులో ఉండటంతో స్థానికులు వీఆర్వో తోట శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. మతప్రచారం నిమిత్తం వీరు మార్చి 18న సత్తెనపల్లి వచ్చారని, లాక్డౌన్ కారణంగా ఎక్కడికీ వెళ్లలేక మసీదులో ఉన్నట్టు గుర్తించారు.