ఆ ఘటనతోనే ఏపీలో కరోనా కేసులు పెరిగాయి: మంత్రి బుగ్గన

ABN , First Publish Date - 2020-04-07T22:09:07+05:30 IST

కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

ఆ ఘటనతోనే ఏపీలో కరోనా కేసులు పెరిగాయి: మంత్రి బుగ్గన

కడప: కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కరోనా నివారణకు లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని, పీపీఈ కిట్స్ కొరత ఉన్నా..అందుబాటులో ఉన్న వరకు అందజేస్తున్నామని చెప్పారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా వైద్యులకు పీపీఈ కిట్స్, మాస్క్‌లు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. వైద్య పరికరాల కొనుగోలుకు సీఎం వెనుకడుగు వేయడం లేదని బుగ్గన పేర్కొన్నారు. రాష్ట్రంలో టెస్టింగ్ ల్యాబ్‌లను నాలుగు నుంచి ఏడుకు పెంచామని మంత్రి బుగ్గన చెప్పారు. దేశంలో అతి తక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి అని, అనుకోని ఘటన కారణంగానే ఏపీలో కేసులు పెరిగాయని మంత్రి బుగ్గన వెల్లడించారు. వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, మున్సిపల్‌, వైద్యసిబ్బంది పనితీరు అభినందనీయమన్నారు. చిన్న చిన్న తప్పులకు ప్రతిపక్షాలు వేలెత్తి చూపడం దారుణమని మంత్రి బుగ్గన మండిపడ్డారు.

Updated Date - 2020-04-07T22:09:07+05:30 IST