ఏపీలో ఏం జరుగుతోంది?

ABN , First Publish Date - 2020-04-02T23:42:25+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ జోన్ల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఒక్క రోజే 100కి పైగా కేసులు నమోదయ్యాయి. కాంటాక్ట్ రేసింగ్ విషయంలో....

ఏపీలో ఏం జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ జోన్ల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఒక్క రోజే 100కి పైగా కేసులు నమోదయ్యాయి. కాంటాక్ట్ ట్రేసింగ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి  చర్యలు తీసుకుంటోంది. దాదాపు మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి సంఖ్య తేలినప్పటి నుంచి అక్కడి కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోందా?. ఆ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?. అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించింది. 


ఈ కార్యక్రమంలో సోషల్ అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ , ప్రొఫెసర్, డాక్టర్ బాబూరావు, మాజీ ఎంసీఐ సభ్యులు డాక్టర్ సీఎల్ వెంకట్రావు పాల్గొన్నారు. సోషల్ అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ ‘‘కరోనా వైరస్ విషయంలో ప్రధానంగా ముఖ్యమంత్రికి పెద్ద విషయం కాదు. లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సమయంలో కరోనాపై సీరియస్‌గా ఆలోచించలేదు.  తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. కేంద్రప్రభుత్వం నుంచి ఉన్న సమాచారం మేరకు తెలంగాణ ప్రభుత్వమే బయటకు తెలియజేసింది. ఏపీ నుంచి అలాంటి సమాచారం అప్పట్లో రాలేదు. కేంద్ర నుంచి మొదటే సమాచారం వచ్చి ఉంటే అప్పుడే ఏపీ అప్రమత్తమయ్యేదేమో. మర్కజ్ వెళ్లి వచ్చిన వారు ముందు జాగ్రత్తగా స్వచ్ఛందంగా ఆస్పత్రికి వెళ్లి చెక్ చేయించుకుంటే ఇంతటి పరిస్థితి వచ్చేదికాదు. మర్కజ్ వెళ్లిన వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.’’ అని అన్నారు. 



Updated Date - 2020-04-02T23:42:25+05:30 IST