కరోనా కేసులు పెరిగినా వైద్య సేవలు అందించడానికి సిద్ధం: కలెక్టర్
ABN , First Publish Date - 2020-04-08T01:44:59+05:30 IST
శ్రీపద్మావతి మహిళా వైద్యకళాశాల ఆస్పత్రిలో 200 పడకలతో కోవిడ్-19 ఆస్పత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు.
తిరుపతి: శ్రీపద్మావతి మహిళా వైద్యకళాశాల ఆస్పత్రిలో 200 పడకలతో కోవిడ్-19 ఆస్పత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరిగినా వైద్య సేవలు అందించడానికి ఇఎస్ఐ, రుయాలో ఉన్న మెడిసిన్ బ్లాక్లలో మరో 200 పడకలను కూడా సిద్ధంగా ఉంచాలని సంబంధిత వైద్య అధికారులు, ఇంజినీరింగ్ శాఖలను కలెక్టర్ ఆదేశించారు. తిరుపతిలో కోవిడ్-19 చికిత్సలకు కావాల్సిసిన మందులు, డాక్టర్లుకు అవసరమైన కిట్లు వంటివి ఒక నెలకు సరిపడా అడ్వాన్స్గా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.