కొత్తగా 2,287 కేసులు
ABN , First Publish Date - 2021-08-02T08:28:45+05:30 IST
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 85,856 శాంపిల్స్ను పరీక్షించగా 2,287 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని,
కరోనాతో మరో 19 మంది మృతి
అమరావతి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 85,856 శాంపిల్స్ను పరీక్షించగా 2,287 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని, కరోనాతో మరో 19 మంది మృత్యువాత పడ్డారని వైద్యఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 19,68,462కి, మొత్తం మరణాల సంఖ్య 13,395కి పెరిగింది. తాజాగా తూర్పుగోదావరిలో 410 మందికి వైరస్ సోకగా.. చిత్తూరులో 377, కృష్ణాలో 299, గుంటూరులో 231 కేసులు నమోదయ్యాయి. రికవరీల సంఖ్య 19,34,048కి చేరగా ప్రస్తుతం 21,019 యాక్టివ్ కేసులున్నాయి. చిత్తూరు జిల్లాలో నలుగురు కరోనాతో మృతిచెందగా.. కృష్ణా, నెల్లూరుల్లో ముగ్గురేసి, తూర్పుగోదావరి, ప్రకాశంలలో ఇద్దరేసి, గుంటూరు, కర్నూలు, విశాఖ, పశ్చిమగోదావరిలలో ఒక్కొక్కరు మరణించారు.