కరోనా కాటుకు ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-05-22T09:25:36+05:30 IST

రంగారెడ్డి జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ వైరస్‌ ఉధృతి పెరుగుతుండటంతో ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు.

కరోనా కాటుకు ఒకరి మృతి

కొత్తగా మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు

రంగారెడ్డి జిల్లాలో 136కి చేరిన బాధితుల సంఖ్య


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : రంగారెడ్డి జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ వైరస్‌ ఉధృతి పెరుగుతుండటంతో ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు. సరూర్‌నగర్‌ మండలం మన్సూరాబాద్‌కు చెందిన 36ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. గురువారం జిల్లాలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాజేంద్రనగర్‌ పరిధిలోని నార్సింగ్‌, సరూర్‌నగర్‌లోని వనస్థలిపురం, శాస్ర్తిపురంలో ఒక్కో కేసు నమోదైంది. వీటితో ఇప్పటివరకు బాధి తుల సంఖ్య 136కి చేరుకుంది. 

Updated Date - 2020-05-22T09:25:36+05:30 IST