కరోనాపై పోరుకు టీం-11

ABN , First Publish Date - 2020-03-30T13:38:13+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 1139 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 30 మంది మరణించారు. తాజాగా కరోనా నివారణకు మోదీ ప్రభుత్వం 11 కమిటీలను ఏర్పాటు చేసింది.

కరోనాపై పోరుకు టీం-11

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 1139 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,  అందులో 30 మంది మరణించారు. తాజాగా కరోనా నివారణకు మోదీ  ప్రభుత్వం 11 కమిటీలను ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా ఎదురయ్యే అత్యవసర పరిస్థితులపై బ్లూప్రింట్ సిద్ధం చేయడం ఈ కమిటీ బాధ్యత. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలలో ప్రభుత్వ సీనియర్ అధికారులు వుంటారు. మెడికల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్లాన్ కోసం మొదటి కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి. పాల్ నాయకత్వం వహిస్తున్నారు. అలాగే క్లిష్టమైన సంరక్షణ శిక్షణల పర్యవేక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేశారు. వైద్య పరికరాలు, ప్రజలకు ఆహారం, మందులు, ప్రైవేటు రంగం, స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం, లాక్‌డౌన్.. ఇలా పలు అంశాల పర్యవేక్షణ కోసం కమిటీలు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-03-30T13:38:13+05:30 IST