కరోనా ఎఫెక్ట్.. జిల్లాలో హైఅలర్ట్

ABN , First Publish Date - 2020-04-10T01:52:40+05:30 IST

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు.

కరోనా ఎఫెక్ట్.. జిల్లాలో హైఅలర్ట్

నిర్మల్, తెలంగాణ: కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. నిర్మల్‌ జిల్లాలో శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. అనవసరంగా రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ ఎస్పీ శశిధర్‌ రాజు స్పష్టం చేశారు. కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని కేంద్రం ప్రకటించింది.

Updated Date - 2020-04-10T01:52:40+05:30 IST