తెలంగాణలో కరోనా కల్లోలం.. శనివారం ఒక్కరోజే బీభత్సంగా..

ABN , First Publish Date - 2020-07-05T02:17:39+05:30 IST

తెలంగాణలో తాజాగా 1,850 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ...

తెలంగాణలో కరోనా కల్లోలం.. శనివారం ఒక్కరోజే బీభత్సంగా..

హైదరాబాద్: తెలంగాణలో తాజాగా 1,850 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 22,312కి చేరుకుంది. మొత్తం 288 మంది మృతి చెందారు. శనివారం 6,427 మందికి కొవిడ్ టెస్ట్‌లు చేశారు. తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 1,10,545 మందికి కొవిడ్‌ టెస్ట్‌లు చేశారు.


శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1,572 కరోనా కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 92, మేడ్చల్‌లో 53, సంగారెడ్డి 8, కరీంనగర్ 18, మహబూబ్ నగర్ 5, గద్వాల్ 2, రాజన్న సిరిసిల్ల 3, ఖమ్మం 7, నల్గొండ 10, సిద్దిపేట 5, వరంగల్ రూరల్ 6, జగిత్యాల 5, నిర్మల్ 1, నిజామాబాద్ 17, వరంగల్ అర్బన్ 31, భద్రాద్రి కొత్తగూడెం 3, వికారాబాద్ 3, భువనగిరి 1,జయశంకర్ భూపాలపల్లి 4, జనగాం 3, మెదక్‌లో 1 కేసు నమోదు అయింది. కొత్తగా 1342 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 11,537 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 10,487 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 



Updated Date - 2020-07-05T02:17:39+05:30 IST