దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 50,129 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-10-25T16:24:21+05:30 IST

దేశంలో కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది.

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 50,129 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే తక్కువగా ఉండటం విశేషం. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 78.64 లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన తాజా వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో కొత్తగా 50,129 కరోనా కేసులు నమోదయ్యాయి. 



దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 78,64,811గా ఉంది. గడచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా మొత్తం 587 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ దేశంలో మొత్తం 1.18,384 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో 62,077 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 

Updated Date - 2020-10-25T16:24:21+05:30 IST