మహారాష్ట్రలో నవంబర్ 30 వరకు లాక్డౌన్ పొడిగింపు
ABN , First Publish Date - 2020-10-30T01:09:57+05:30 IST
మహారాష్ట్రలో నవంబర్ 30 వరకు లాక్డౌన్ పొడిగింపు
ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యం మహారాష్ట్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న కంటైన్మెంట్ జోన్లలో నవంబర్ 30వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.