ఉత్తరాఖండ్: నేడు రెండు లక్షల మందికి టీకాలు!
ABN , First Publish Date - 2021-08-23T16:56:17+05:30 IST
కరోనా నుంచి కాపాడేందుకు వ్యాక్సినేషన్...
డెహ్రాడూన్: కరోనా నుంచి కాపాడేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఈరోజు ఉత్తరాఖండ్లో వ్యాక్సినేషన్లో నూతన రికార్డు నెలకొల్పేందుకు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఈరోజు మొత్తం రెండు లక్షల మందికి టీకాలు వేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో డెహ్రాడూన్లో అత్యధికంగా లక్షమందికి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ను ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే కేంద్రం నుంచి పరిమిత మోతాదులోనే వ్యాక్సిన్ అందడంతో రాష్ట్రం వ్యాక్సినేషన్ విషయంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది.