అమరావతిలో 140 మంది ఉద్యోగులకు కరోనా

ABN , First Publish Date - 2021-03-05T17:59:32+05:30 IST

అమరావతి జిల్లాలో కొవిడ్-19 పాజిటివ్ కేసులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

అమరావతిలో 140 మంది ఉద్యోగులకు కరోనా

అమరావతి (మహారాష్ట్ర): అమరావతి జిల్లాలో కొవిడ్-19 పాజిటివ్ కేసులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఒకవైపు కరోనా టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నా, మరోవైపు అమరావతిలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. అమరావతి జిల్లా మెజిస్ట్రేట్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో 140 మందికి కరోనా వైరస్ సోకింది. అమరావతి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో 60 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. అమరావతి మెట్రోపాలిటన్ మున్సిపాలిటీలో 80 మంది ఉద్యోగులకు కరోనా పాటిటివ్ అని పరీక్షల్లో వెల్లడైంది.కొవిడ్ వైరస్ వల్ల అమరావతి మున్సిపాలిటీలో ఐదుగురు ఉద్యోగులు మరణించారు.దేశంలో మహారాష్ట్రలోని అమరావతిలో  కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా హాట్ స్పాట్ గా మారింది. 

Updated Date - 2021-03-05T17:59:32+05:30 IST