కరోనాతో గుజరాత్ లో మరొకరు మృతి

ABN , First Publish Date - 2020-03-30T18:10:17+05:30 IST

గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో మరో కరోనా మరణం సంభవించింది. కరోనా వైరస్ కారణంగా 45 ఏళ్ల మహిళ భావ్‌నగర్‌లో సోమవారం ఉదయం మరణించింది. భావ్‌నగర్‌లో కరోనా కారణంగా రెండవ మరణం...

కరోనాతో గుజరాత్ లో మరొకరు మృతి

అహ్మదాబాద్: గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో మరో కరోనా మరణం సంభవించింది. కరోనా వైరస్ కారణంగా 45 ఏళ్ల మహిళ భావ్‌నగర్‌లో సోమవారం ఉదయం మరణించింది. భావ్‌నగర్‌లో కరోనా కారణంగా రెండవ మరణం సంభవించింది. గుజరాత్ లో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 29 మంది కరోనా ఇన్‌ఫెక్షన్‌తో మరణించారు. పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్‌లో ఆసుపత్రిలో చేరిన 54 ఏళ్ల కరోనా రోగి ఈరోజు ఉదయం మరణించారు. గుజరాత్‌లో మొత్తం కరోనా సోకిన కేసుల సంఖ్య 69కి చేరుకుంది. అంతకుముందు ఆదివారం 45 ఏళ్ల కరోనా పాజిటివ్ వ్యక్తి అహ్మాదాబాద్ ఆసుపత్రిలో మరణించాడు. కరోనా వైరస్ కారణంగా అహ్మదాబాద్‌లో ముగ్గురు, భావ్‌నగర్‌లో ఇద్దరు, సూరత్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-03-30T18:10:17+05:30 IST