యువకుడిని ఐసోలేషన్‌కు తరలింపును అడ్డుకున్న మతపెద్దలు

ABN , First Publish Date - 2020-04-02T21:15:18+05:30 IST

చింతలపాలెం మండలం గుడిమల్కాపురంలో యువకుడిని ఐసోలేషన్‌కు తరలింపును మతపెద్దలు అడ్డుకున్నారు. అంబులెన్స్‌ను మతపెద్దలు, కుటుంబసభ్యులు అడ్డుకున్నారు.

యువకుడిని ఐసోలేషన్‌కు తరలింపును అడ్డుకున్న మతపెద్దలు

సూర్యాపేట: చింతలపాలెం మండలం గుడిమల్కాపురంలో యువకుడిని ఐసోలేషన్‌కు తరలింపును మతపెద్దలు అడ్డుకున్నారు. అంబులెన్స్‌ను మతపెద్దలు, కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ఖమ్మం క్వారంటైన్ నుంచి గ్రామానికి యువకుడు వెళ్లిపోయాడు. అంతేకాదు వైద్య పరీక్షలకు యువకుడు నిరాకరిస్తున్నాడు. 


ఇప్పటికే నల్గొండ జిల్లాలో తొలిసారిగా ఆరు పాజిటీవ్ కేసులు ఒక్కరోజే నమోదు కావడంతో కలకలం రేపుతోంది. ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన నల్గొండ పట్టణానికి చెందిన ఐదుగురుకి, మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఒక మహిళకు పాజిటీవ్ అని తేలింది. ఢిల్లీకి వెళ్లివచ్చిన మరికొందరి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండలరావు అన్నారు.


Updated Date - 2020-04-02T21:15:18+05:30 IST