గురుకుల పాఠశాలలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-12-02T02:18:26+05:30 IST
జిల్లాలోని మరో గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. రామచంద్రాపురం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థినులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ణయించారు.
సంగారెడ్డి: జిల్లాలోని మరో గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. రామచంద్రాపురం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థినులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ణయించారు. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఉన్నతాధికారులకు పాఠశాల యాజమాన్యం నివేదిక పంపింది. కరోనాతో విద్యార్థుల తల్లిదండ్రులు భయందోళనకు గురవుతున్నారు.