రాజధానిలో 715 నుంచి 496 తగ్గిన కంటైన్మెంట్ జోన్లు
ABN , First Publish Date - 2020-08-02T16:41:22+05:30 IST
ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఏర్పాటుచేసిన కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 715 నుంచి 496 కి తగ్గింది. ఇంతకుముందు కంటైన్మెంట్ జోన్లలో 3,48,099 మంది ఉండగా, ఇప్పుడు...
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఏర్పాటుచేసిన కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 715 నుంచి 496 కి తగ్గింది. ఇంతకుముందు కంటైన్మెంట్ జోన్లలో 3,48,099 మంది ఉండగా, ఇప్పుడు అక్కడ ఉంటున్నవారి సంఖ్య 1,06,211గా ఉంది. ఢిల్లీ రెవెన్యూ మంత్రి కైలాష్ గెహ్లాట్ ఈ సమాచారం మీడియాకు అందించారు. ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 89.33శాతంగా ఉండగా, 7.75 శాతం యాక్టవ్ కేసులు ఉన్నాయి. 2.91శాతం బాధితులు మృతిచెందారు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 1,118 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఢిల్లీలో మొత్తంమీద 1,36,716 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,201 మంది రోగులు కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం మీద 1,22,131 మంది రోగులు కోలుకున్నారు. గత 24 గంటల్లో 26 మంది రోగులు మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 3,989కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో 1,201 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తంమీద 12, 2131 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం 10,596 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోంక్వారంటైన్లో 5, 660 మంది బాధితులు ఉన్నారు. గత 24 గంటల్లో 5,140 ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరిగాయి. గత 24 గంటల్లో 13,014 యాంటీజెన్ పరీక్షలు జరిగాయి.