కరోనా వ్యాక్సినేషన్ కోసం హెల్త్ వర్కర్స్ నమోదు ప్రక్రియ ప్రారంభం!
ABN , First Publish Date - 2020-12-05T12:47:35+05:30 IST
భారత్తో పాటు దేశ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే...
న్యూఢిల్లీ: భారత్తో పాటు దేశ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కోసం హెల్త్ వర్కర్స్ నమోదు ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలోని హెల్త్కేర్ ఫెసిలిటీస్ (ఇన్స్టిట్యూషన్, నర్సింగ్ హోం, ఓపీడీ, క్లీనిక్ మొదలైనవి) తమ హెల్త్కేర్ వర్కర్స్ పేర్లను పంపించాలని కోరింది.
మరోవైపు కేంద్రప్రభుత్వం కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ నేపధ్యంలోనే ప్రధాని ఆధ్వర్యంలో వైద్యఆరోగ్యశాఖ అధికారుల సమావేశం జరిగింది. దేశంలో కోటిమంది హెల్త్వర్కర్స్కు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. తరువాత రెండు కోట్లమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్కు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తరువాత 27 కోట్లమంది సీనియర్ సిటిజన్స్కు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు.