లాక్ డౌన్ లోనూ శునకంతో వీడని అనుబంధం
ABN , First Publish Date - 2020-03-30T13:16:50+05:30 IST
లాక్ డౌన్ లోనూ శునకంతో వీడని అనుబంధం
లక్నో: మోడీ ప్రభుత్వం కరోనా వైరస్ ను ఓడించేందుకు 21 రోజుల లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్నిరంగాలు మూతపడ్డాయి. ఫలితంగా జనం పట్టణాల నుండి గ్రామాల్లోని వారి గృహాలకు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో జంతు ప్రేమకు సంబంధించిన ఒక ఉదాహరణ ఆసక్తి కరంగా నిలిచింది. ఇది యూపీలోని లక్నోలో దర్శనమిచ్చింది. ఇది హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన గణేష్ కథ. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణంలో గణేష్ తన పెంపుడు కుక్క షేరును విడిచిపెట్టలేదు.6 నెలల షేరూ అతనితో పాటు బస్సు, లారీ, ట్రాక్టర్లో ప్రయాణించింది. గణేష్ కూర్చున్న చోటనే షేరూ కూర్చుంది. గణేష్ మొదట తన ప్రయాణంలో షేరూను వదిలివేయాలనుకున్నాడు. కానీ ఆశునకం గణేష్ ను విడిచిపెట్టకుండా అతని వెంటే ఫరీదాబాద్ కు వచ్చింది.