ఒక్కో బ్రాండ్‌కు రూ. 4 నుంచి 5 కోట్లు?

ABN , First Publish Date - 2021-08-04T09:25:46+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుతో ఒప్పందాలకు బడా కార్పొరేట్‌ కంపెనీలు క్యూ కడుతున్నాయి...

ఒక్కో బ్రాండ్‌కు  రూ. 4 నుంచి 5 కోట్లు?

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుతో ఒప్పందాలకు బడా కార్పొరేట్‌ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సింధు 9-10 సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. తాజాగా మరో రెండు ఆహార ఉత్పత్తుల సంస్థ (ఎఫ్‌ఎమ్‌సీజీ)లతో ఆమె ఒప్పందం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ-వెహికిల్‌ కంపెనీలు కూడా టచ్‌లో ఉన్నట్టు సింధు పోర్ట్‌ఫోలియో చూస్తున్న తుహిన్‌ మిశ్రా తెలిపారు. కాగా, 2019లో వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప స్వర్ణం నెగ్గాక సింధు తన ఎండార్స్‌మెంట్‌ ఫీజును 25 నుంచి 50 శాతం పెంచింది. ఇప్పుడు ఆమె ఒక్కో ఒప్పందానికి రూ. 4 నుంచి 5 కోట్ల వరకు తీసుకున్నా ఆశ్చర్యపోనవసరంలేదు. భారత్‌లో క్రికెటేతర క్రీడల్లో సింధు మాత్రమే ఎక్కువ బ్రాండ్‌ వాల్యూ కలిగిన క్రీడాకారిణి కావడం విశేషం.


Updated Date - 2021-08-04T09:25:46+05:30 IST