అనారోగ్యంతో మాజీ కార్పొరేటర్‌ మహమూద్‌ మృతి

ABN , First Publish Date - 2022-01-24T04:33:21+05:30 IST

అనారోగ్యంతో మాజీ కార్పొరేటర్‌ మహమూద్‌ మృతి

అనారోగ్యంతో మాజీ కార్పొరేటర్‌ మహమూద్‌ మృతి
మహమూద్‌ (ఫైల్‌)

మట్టెవాడ, జనవరి 23: వరంగల్‌ ఎల్లంబజార్‌కు చెందిన మాజీ కార్పొరే టర్‌ ఎమ్డీ మహమూద్‌(55) ఆదివా రం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయ న ఆదివారం ఉదయం ఇంటిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మహ మూద్‌ 1995, 2005 వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో రెండు పర్యాయాలు కార్పొరేటర్‌గా గెలుపొం దారు. 2005- 2010 జీడబ్ల్యూంఎసీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడల్‌గా పనిచేశారు. మహమూద్‌కు భార్య, కుమా రుడు, కుమార్తె ఉన్నారు. కు మారుడు విదేశం నుంచి సో మవారం రానుండటంతో అంత్యక్రియలను ఆయన వచ్చి న తర్వాత నిర్వహించనున్న ట్లు కుటుంబ సభ్యులు తెలిపా రు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని న రేందర్‌ తదితరులు మహమూద్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళు ర్పించారు. అలాగే కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ య్య, మాజీ మేయర్‌ ఎర్ర బెల్లి స్వర్ణ, కార్పొరేటర్‌ తోట వెంకన్న, పీసీసీ కార్యదర్శి అయూబ్‌, సహచర మాజీ కార్పొరేటర్లు తత్తరి లక్ష్మణ్‌, దామెర సర్వేష్‌ తదితరులు మృతదేహం వద్ద నివాళులర్పించి కు టుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూ తిని తెలిపారు. మహమూద్‌ మృతి పట్ల పలువురు కాంగ్రెస్‌ నాయకులు సంతాపం ప్రకటించారు. 

Updated Date - 2022-01-24T04:33:21+05:30 IST