పంచాయతీలో అవినీతిపై విచారణ చేపట్టాలి

ABN , First Publish Date - 2021-10-25T04:57:02+05:30 IST

పంచాయతీలో అవినీతిపై విచారణ చేపట్టాలి

పంచాయతీలో అవినీతిపై విచారణ చేపట్టాలి
శివారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

దోమ: గ్రామపంచాయతీ నిధుల అవకతవకలపై విచారణ చేపట్టి గ్రామాభివృద్దికి కృషిచేయాలని కోరుతూ శివారెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్థులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ 2019 నుంచి 2021 మార్చి వరకు ప్రభుత్వం శివారెడ్డిపల్లి పంచాయతీకి రూ.41లక్షల నిధులు మంజూరు చేసిందన్నారు. అట్టి నిధుల నుంచి రూ.40లక్షలు గ్రామపంచాయతీ ఖర్చు చేసినట్లు చూపుతున్నారన్నారు. అందులో కొన్ని లక్షల రూపాయలకు ఎంబీలు లేకుండానే ఖర్చు చేసినట్లు తేలడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ నిధులపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని గ్రామస్థులు నర్సింహులు తదితరులు కోరారు.

Updated Date - 2021-10-25T04:57:02+05:30 IST